ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి

– మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్ట
హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) :
దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ఉగ్రవాద వ్యతిరేక సంస్థ చైర్మన్‌ మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్టా కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అనంతరం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బిట్టా మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఉగ్రవాదం వివిధ రూపాల్లో విస్తరించి అమాయకులను బలిగొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్‌లో ఎవరూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. బాంబు పేలుళ్లలో మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.