ఉగ్రవాదుల దగ్గర బందీలెవరూ లేరు: కిరణ్ రిజిజు

ukt7nkh2న్యూఢిల్లీ, జులై 27: పంజాబ్‌లోని దీనానగర్ దాడుల ఘటనలో ఉగ్రవాదుల వద్ద ఎవరూ బందీలుగా లేరని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఈ ఘటనలో పోలీసు కుటుంబాలకు చెందిన కొందరిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారన్న వార్తలపై మంత్రి స్పందించారు. కొందరిని ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నట్టు కొన్ని వార్తలు తన దృష్టికి వచ్చాయన్న కిరణ్, ఒకవేళ మరింత సమాచారం వస్తే దానిపై తాను స్పందిస్తానన్నారు. ప్రస్తుతానికి ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నందున అందుకు సంబంధించిన వివరాలేమీ తాను ఇవ్వలేనన్నారు. ఉగ్రవాదులపై పోరు కోసం భద్రతా దళాలను అప్రమత్తం చేశామన్న కేంద్రమంత్రి, ఇప్పటికే ఎన్ఎస్‌జీ కమాండోలు, సైనిక దళాలను దీనానగర్ పంపించామన్నారు.