ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

తిరుమలగిరి (సాగర్) అక్టోబరు 06 (జనంసాక్షి): గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికై, ఎల్లాపురం తండ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న నరేందర్, నవత లకు శుక్రవారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ,ఎస్ఎంసి చైర్మన్ కుర్ర శంకర్ నాయక్ లు ,పాఠశాల ఆవరణలో శాలువాలు ,పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థులను చదువుల పట్ల ఆకర్షితులను చేసి ,వారిని ప్రోత్సహిస్తూ వారి నైపుణ్యాలను మెరుగుపరుగు చుకునేందుకు సహకరించాలన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నోవా సుశీల స్వాతి తదితరులు పాల్గొన్నారు.