ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్లోని కాన్ పూర్ దేహత్ జిల్లా పుఖ్రాయాన్ వద్ద పాట్నా నుండి ఇండోర్ వెళుతున్న ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో ఉదయం 3.15గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో 63మంది మృతి చెందగా 150పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి మృతిని కుంటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయబడిన వారికి రూ.50వేలు, స్వలంగా గాయపడినవారికి రూ.25వేలు చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.