ఉత్తరాఖండ్‌లో హైఅలర్ట్‌

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదులుగా భావిస్తున్న ఎనిమిది మంది రాష్ట్రంలో తలదాచుకున్నారని వారిలో ఒకరిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని మంగళవారం అక్కడి పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమం అనంతరం ఉత్తరాఖండ్‌ డీజీపీ బీఎస్‌ సింధు వివరాలు వెల్లడించారు.

తమకు ఈ సమాచారం ఓ వీడియో క్లిప్పింగ్‌ ద్వారా అందిందని తెలిపారు. అయితే ఎవరు ఈ వీడియోని పంపించారన్న విషయాన్ని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీంతో తమ రాష్ట్రంలో అలర్ట్‌ ప్రకటించామని చెప్పారు. ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.