ఉత్తర కాశీలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
డెహ్రాడూన్,అక్టోబర్15(జనంసాక్షి): ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జోగాట్ , చిన్యాలీసోర్ మార్గంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.