ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్

లక్నో: కదులుతున్న కారులో 22ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అజ్రదా గ్రామ సమీపంలో జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. బిజ్నోర్‌ జిల్లాలోని నాగినా గ్రామానికి చెందిన యువతిపై అజ్రదా అటవీ ప్రాంతంలో ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం ఆమె స్పృహ తప్పిపడిపోవడంతో ఆ అటవీ ప్రాంతంలోనే వదిలేసి వెళ్లారని తెలిపారు. తేరుకున్న ఆమె గురువారం పోలీసు స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేసిందని చెప్పారు. 22-year-old girl gang raped in moving car in Meerut ‘వసీం అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గజియాబాద్‌కి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లాక కారులో నన్ను మీరట్‌కు తీసుకెళ్లాడు. తరువాత ఆ కారులో తన స్నేహితులని చెప్పి మరో ఇద్దరిని ఎక్కించుకున్నాడు. మద్యం సేవించి ఉన్న వారు ముగ్గురూ కలిసి మార్గమద్యంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డారు’ అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. తనకు కూల్‌డ్రింక్‌లో మత్తు పదార్థం కలిపి ఇచ్చారని, అది తాగిన తర్వాత స్పృహకోల్పాయనని ఆమె తెలిపింది. ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు వసీంతోపాటు మరో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.