ఉద్యోగమిప్పిస్తామని చెప్పి మహిళపై అత్యాచారం

26305257మధుర : పరిశ్రమలో ఉద్యోగమిప్పిస్తామని చెప్పి ఓ మహిళను హోటల్ కు పిలిపించిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మధుర నగరంలోని ఓ హోటల్ లో శ్యాంసుందర్ కర్ధం, గోపిచంద్ లనే ఇద్దరు వ్యక్తులు తమ పరిశ్రమలో ఉద్యోగమిస్తామని చెప్పి 35 ఏళ్ల ఓ మహిళను హోటల్ కు రప్పించి అత్యాచారం జరిపారని డీఎస్పీ పీయూష్ కుమార్ చెప్పారు. బాధిత మహిళ హర్యానాలోని ఫరీదాబాద్ అని. ఆమె బ్యూటీపార్లర్ నిర్వహించేదని డీఎస్పీ పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేర ఐపీసీ 376 కింద కొత్వాలీ పోలీసుస్టేషనులో కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కాగా అత్యాచారం కేసులో నిందితుడైన శ్యాంసుందర్ కర్ధం మాజీ బీఎస్పీ నాయకుడని పోలీసులు తెలిపారు. నిందితుడు 2014 లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేశారని పోలీసులు వివరించారు.