ఉద్యోగ భద్రత కల్పించాలని రేషన్ డీలర్ల నిరసన

 ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ ఫెడరేషన్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు వలిగొండ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట మండలంలోని రేషన్ డీలర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు.అనంతరం తహశీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీలర్లు సంక్షేమ సంఘం పిలుపుమేరకు నిరసన తెలిపామని, క్వింటాలుకు 440 కమిషన్, ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని,బియ్యం దిగుమతి,హమాలి కూలి ప్రభుత్వమే చెల్లించాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు పాశం స్వామి, ప్రధాన కార్యదర్శి ఎండి జహంగీర్ ఉపాధ్యక్షులు వనగంటి రామాహరి నరసింహ చారి కోశాధికారి పుర్మ అంజయ్య, రేషన్ డీలర్ల మాజీ అధ్యక్షుడు రఘు, ఎర్ర రామకృష్ణారెడ్డి అంజిరెడ్డి మునుకుంట్ల వెంకులు శ్రీనివాస్ యాదగిరి రత్నయ్య,కృష్ణ స్వామి, వెంకటేష్,శ్రీను,శ్రీలత, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు