ఉపాధ్యాయుడుగా మారిన ప్రణబ్

రాష్ట్రపతి ప్రణబ్ ఇవాళ s53hcqzrకొద్ది సేపు టీచర్‌గా మారి పాఠాలు చెప్పనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఆవరణలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులకు క్లాసులు చెప్పనున్నారు. 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు భారత రాజకీయ చరిత్రపై అవగాహన కల్పించనున్నారు. రాజకీయ ప్రవేశంకంటే ముందు ప్రణబ్ ముఖర్జీ 1969లో కళాశాల అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా పని చేశారు. క్లాసులు చెప్పిన తర్వాత వందమంది ఉపాధ్యాయులు, విద్యార్థులతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొంటారు. అటు మానెక్‌షా ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులతో ముఖాముఖి జరపనున్నారు. తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్ధులు, ఉపాధ్యాయులతో ప్రధాని వీడియో కాన్షరెన్స్‌ లో మాట్లాడనున్నారు.