ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

` మధ్యంతర ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం
` టీచర్‌ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం
` ఉపాధ్యాయ దంపతులకు మాత్రం అదనపు పాయింట్లు కేటాయింపుకు సమ్మతి
హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణలోని ప్రభుత్వ టీచర్ల బదిలీలకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై విధించిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. అయితే టీచర్‌ యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లు కేటాయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.ఉపాధ్యాయ దంపతులకు మాత్రం అదనపు పాయింట్లు కేటాయించడానికి కోర్టు అనుమతించింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున అదనపు ఏజీ రామచంద్రరావు, పిటిషనర్ల తరపున చిక్కుడు ప్రభాకర్‌, కృష్ణయ్య వాదనలు వినిపించారు.