ఉమ్మడి జిల్లా అభివృద్ది పై నేడు మునుగొడు లో మంత్రుల సమీక్ష

కే టి ఆర్ రాక

 నల్గొండబ్యూరో, జనం సాక్షి.ఉమ్మడి నల్గొండ జిల్లా లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు పై రాష్ట్ర పురపాలక,పట్టణ అభివృద్ది, ఐ.టి.శాఖ మంత్రి కె.టి.రామారావు,రహదారులు,భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి,రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు,రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు లు మును గోడ్ లో నేడు ఉమ్మడి జిల్లా నల్గొండ,యాదాద్రి భువనగిరి, సూర్యా పేట జిల్లాల అధికారులతో నల్గొండ (1.12.22) న సమీక్షించ నున్నారు. ఈ సమావేశం లో మంత్రుల తో పాటు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహణ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి బుధవారం మును గోడ్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ సింగ్,అధనపు కలెక్టర్ భాస్కర్ రావు,సూర్యా పేట ఎస్.పి.రాజేంద్ర ప్రసాద్,నల్గొండ డి.ఎస్.పి.నర్సింహ రెడ్డి,వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాట్లపై సమీక్షించి సూచనలు చేశారు.