ఉరిశిక్షను రద్దు చేయండి
-యుద్ధనేరాలు, ఉగ్రవాదదాడులు మినహా
-లా కమిషన్ సిఫారసు
ఢిల్లీ , ఆగష్టు 31 (జనంసాక్షి):
ఉగ్రవాదం, యుద్ధనేరాల కేసుల్లో దోషులకు మినహా ఇతర రకాల అన్ని కేసుల్లో ఉరిశిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ
షా ఈ మేరకు నివేదిక రూపొందించారు.ఉరిశిక్షను రద్దు చేయడంపై జస్టిస్ షా నివేదికపై లా కమిషన్లోని ముగ్గురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా, మరో ఆరుగురు
సభ్యులు మద్దతు తెలిపారు. ఉగ్రవాద చర్యల్లో మరణశిక్ష గురించి పార్లమెంట్లో చర్చజరగాలని, ఈ కేసుల్లో ఉరిశిక్ష రద్దుకు వెంటనే సిఫారసు చేయబోమని లా కమిషన్
పేర్కొంది.