ఉరుగ్వే వరదలకు ఏడుగురు మృతి

న్యూఢిల్లీ,ఏప్రిల్‌18 : దక్షిణ అమెరికాలోని ఉరుగ్వేలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా, 2వేల మంది నిరాశ్రయులయ్యారు. ధ్వంసమైన ఇళ్లను పునర్‌నిర్మించే ఏర్పాట్లు చేయనున్నామని ఉరుగ్వే అధ్యక్షుడు టబారే వాజ్కే తెలిపారు. వరదల కారణంగా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపడుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.