ఉల్ఫా చేతిలో ఐదుగురు హత్య

 

గౌహతి,నవంబర్‌2(జ‌నంసాక్షి): అస్సాంలో ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. అనుమానిత యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (యుఎల్‌ఎఫ్‌ఎ-ఉల్పా) ఉగ్రవాదులు వారిని హత్య చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అస్సాంలోని టిన్‌సుకియా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఉల్ఫాకు చెందిన పరేశ్‌ బారువా వర్గమైన ఉల్ఫా-ఇండిపెండెంట్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వారు తెలిపారు. టిన్‌సుకియా జిల్లాలోని ఖేర్‌బరి బిసోనిబరి ప్రాంతంలో తుపాకీ చూపించి ఐదుగురు వ్యక్తులను ఎంచుకుని వారిని హత్య చేశారు. అస్సాం డిజిపి కులధర్‌ సైకియా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చి పరిస్థితి సవిూక్షిస్తున్నారు.