ఊరూరా వాడవాడలా రామకోటి రచన

    బోథ్ (జనంసాక్షి) లోక కళ్యార్థం చేపట్టిన రామకోటి రచన కార్యక్రమం ఉరురా… వాడవాడలా సాగాలని శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక అధ్యక్షులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ ఆకాంక్షించారు. ప్రస్తుతం బోథ్ డివిజన్ పరిధిలోని బోథ్, బజార్హాత్నుర్, ఇచ్చోడ,  మండలాల పరిధిలోని గ్రామాలలో కార్యక్రమం కొన ఆగూతుందనీ అన్నారు. మీమీ గ్రామాలలో, కాలనీలలో కార్యక్రమం నిర్వహించదలుకుంటే నిర్వాహకులను సంప్రదించవచ్చని అన్నారు. ఇందుకోసం నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు. మీ మీ కాలనీల్లో 50 మంది భక్తులు సిద్దంగా ఉండి వేదిక మీ ఇల్లు ఆలయం, కమ్యూనిటీ హాల్, లేదా మీ ఇల్లు కావచ్చు. 108 నుండి 1008 సార్లు రామనామం రాయడానికి వీలుగా పేపర్లు సిధ్ధంగా మావద్ద ఉన్నాయి. అంతే కాకుండా కోటి వ్రాసే వారికి వీలయ్యే పుస్తకాలు  కూడా  అందుబాటులో ఉన్నాయి. దీనికోసం ఎటువంటి నిర్ణీత ఫీజు గానీ ఖర్చులు గాని లేవు. రామకార్యంలో అందరినీ భాగస్వాములను చేయిలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కార్యక్రమం మీ మీ గ్రామాలలో, కాలనులలో నిర్వహించాలనుకునే వారు ఆసక్తి గల వారు సెల్ నెంబర్ 9441796902, 8464896902 లలో సంప్రదించవచ్చన్నారు.