ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ వోవైసీ అరెస్టు, విడుదల

Untitled-6
పూర్ణియా,అక్టోబర్‌28 (జనంసాక్షి):

ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్‌ ఎంపీ అస దుద్దీన్‌ ఒవైసీని బిహార్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. పూర్ణియా జిల్లాలోని బైసీ ప్రాం తంలో ఆయనను అదు పులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనను బె యిల్‌ పై విడుదల చేశా రు. ప్రధాని నరేంద్ర మో దీపై అభ్యంతకర వ్యాఖ్య లు చేసినందుకు పోలీసులు అసద్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు.బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్‌ గంజ్‌ లో నిర్వహించిన ర్యాలీలో మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బైసీలో అనుమతి లేకుండా ఎన్నికల సభ పెట్టారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఫేస్‌ బుక్‌ లో అసదుద్దీన్‌ చేసిన పోస్టింగ్‌ లపైనా కేసు నమోదైంది. తన ఇమేజ్‌ ను దెబ్బతీసేలా ఫొటోలు పెట్టారని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథన్‌ కేసు పెట్టారు.