ఎండల నుంచి ఉపశమనం

` రాష్ట్రవ్యాప్తంగా చల్లబడ్డ వాతావరణం
మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడిరది. భారీ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గురువారం రోజు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల్‌, నారాయణపేట్‌, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడిరచింది. కాగా ద్రోణి కర్ణాటక విూదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి విస్తరించిందని వివరించింది. ఆకాశం మేఘావృతమై ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.