ఎంపికైన కానిస్టేబుల్ లను అభినందించి, సన్మానించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎన్ బిఆర్ చైర్మన్ సిద్ధార్థ

కానిస్టేబుల్ తుది రాత పరీక్షల ఫలితాలలో సత్తా చాటిన ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ విద్యార్ధులు…

మిర్యాలగూడ, అక్టోబర్ 7.జనం సాక్షి.

తెలంగాణరాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీ.ఎస్‌.ఎల్‌.పీ.ఆర్‌.బీ) ఇటివలే విడుదల చేసిన కానిస్టేబుల్ తుది రాత పరీక్షల ఫలితాలలో ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ విద్యార్ధులు సత్తా చాటారు.మొత్తం 20 మంది సివిల్, ఏ ఆర్ విభాగాల్లో ఎంపిక కాగా, ఒకరు ఏ ఆర్ ఎస్సైగా ఎంపికయ్యారు. ఎంపికైన వారు శనివారం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్దార్ధ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కానిస్టేబుల్ గా ఎంపికైన వారిని అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య (సంపత్), మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, ఉపాధ్యాయులు సుద్దుల సైదులు, వెంకటరత్నం, శిరసన గండ్ల శ్రీకాంత్ చారి, గ్రంథాలయ ఇంచార్జి కుమ్మరికుంట్ల సుధాకర్, పోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.