ఎంపీలు పార్టీని వీడరు : డిప్యూటీ సీఎం దామోదర

న్యూఢిల్లీ : రాష్ట్రంలో పార్టీ స్థితిగుతులను సోనియాకు వివరించినట్టు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా తెలిపారు. తెలంగాణ అంశంపై సోనియాగాంధీ తో చర్చించానని ఆయన చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీని వీడతారని అనుకోవడం లేదన్నారు. మూడు ప్రాంతాల కార్యకర్తల మనోభావాలు సోనియాకు వివరించానని తెలిపారు.