ఎం పి అరవింద్ ఇంటి పై దాడి కి బీజేపీ ఖండన మిర్యాలగూడ

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటి పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి ని మిర్యాలగూడ బీజేపీ నాయకులు శుక్రవారం ఖండించారు. రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాస రావు, అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్ లు మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ ఇంటి పై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసి వారి తల్లి గారిని నెట్టి వేయడం దుర్మార్గం అన్నారు. లిక్కర్ స్కాం లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొలేక కవిత తన గుండాలను ఉసి గోల్పి దాడులు చేయడం సరికాదు అన్నారు. బీజేపీ కి వస్తున్న ఆదరణ ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని ప్రజలు తిప్పి కొడతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎడ్ల రమేష్, దొండపాటి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.