ఎం సి పి ఐ యు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఈ నెల 23 24 25 న హైదరాబాద్ మియాపూర్ లో జరగబోయే ఎం సి పి ఐ యు 3వ రాష్ట్ర మహాసభలను
 జయప్రదం చేయాలని ఎం సి పి ఐ యు మండల కార్యదర్శి  దామ సాంబయ్య తెలిపారు.మండల కేంద్రంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడిదారులైనా ఆదాని,అంబానీలకు దోచి పెడుతూ నిరుద్యోగ సమస్యలను పెంచుతున్నారని అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. బహుజన ఎస్సీ ,ఎస్టీ ,బిసి,మైనార్టీల రాజ్యాధికారం కోసం ఎం సి పి ఐ యు పనిచేస్తుందని అందుకోసమే రాష్ట్ర మహాసభలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. నీళ్లు,నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కాలయాపన చేస్తూ మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎఫ్ డివిజన్ కార్యదర్శి మార్తా నాగరాజు, మండల నాయకులు నాగేల్లి శ్రీనివాస్, సుదర్శన్, మల్లికార్జున్, భాస్కర్, మహేందర్ ,రవి ,శ్రీనివాస్ పాల్గొన్నారు.
Attachments area