ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్ మృతి
న్యూదిల్లీ: మణిపూర్లోని తమెంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎదరుకాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు రాష్ట్రీయ రైఫిల్స్, ప్రత్యేక సైనిక సిబ్బంది గురువారం ఉదయం నుంచి కూంబింగ్ చేపట్టారు. మొదట భద్రతాసిబ్బంది జరిపిన ఎన్కౌంటర్లో జెడ్యూఎఫ్కు చెందిన ఓ ఉగ్రవాది మృతిచెందాడు. దీంతో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపైకి ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆర్మీ మేజర్ అమిత్ దేశ్వాల్ మృతిచెందారు. కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఆర్మీ సిబ్బంది వెల్లడించారు. అమిత్ స్వస్థలం హరియానాలోని జజ్జర్ జిల్లా.