ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోల హతం

 

భువనేశ్వర్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మరోమారు ఎవోబి కాల్పులతో దద్దరిల్లింది. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మృతిచెందారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లా బెజ్జింగ్‌వాడ అడవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఘటనా స్థలం నుంచి మావోయిస్టు అగ్ర నేత రణ దేవ్‌ తప్పించుకున్నాడని సమాచారం.