ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

1
రాంచీ: ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. రాంచీ తైమరా ఘటి పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరపగా… జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా… ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఎదురుకాల్పులు శుక్రవారం ఉదయం ముగిశాయి. సంఘటనా స్థలం నుంచి ఏకే-37 గన్‌, ఐఏఎస్‌ఏఎస్‌ రైఫిల్‌ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.