ఎన్ఐఏ అధికారి దారుణహత్య

31ig52p3 బిజ్నూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో ఎన్‌ఐఏ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్‌ఐఏ డిప్యూటీ ఎస్పీ మహమ్మద్‌ తంజిల్‌ దంపతులపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తంజిల్‌ మృతిచెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తంజిల్‌ దంపతులు పెళ్లికి వెళ్లి ఇంటికి వస్తుండగా .. మార్గమధ్యలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి హసీబ్‌ అహ్మద్‌ తెలిపారు. తంజిల్‌పై 24.. 25 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన భార్యకూ నాలుగు తూటాలు తగిలాయని చెప్పారు