ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలకు: సాగర్ సిఐ బీసన్న

ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలకు: సాగర్ సిఐ బీసన్న

తిరుమలగిరి (సాగర్) అక్టోబర్ 14 (జనంసాక్షి): ఎన్నికల నియమాలని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బీసన్న అన్నాడు .శనివారం మండల పరిధిలోని నాయకుని తండా గ్రామంలో ఎన్నికల నియమావళి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి బీసన్న ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ఎస్సై వి సురేష్ తో కలిసి గ్రామస్తులకు, ఓటర్లకు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగరాదని, అల్లర్లను ప్రోత్సహించరాదని , ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేరావత్ కొండ నాయక్, హతిరాం నాయక్, ముని నాయక్, బిచ్చా నాయక్ ,రతన్ గ్రామస్థులు పాల్గొన్నారు