ఎన్నికల ప్రచారం కోసం మోడీ ర్యాలీ

hym-slidepic1aబీహార్‌లో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ భాగల్పూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. పరివర్తన్ ర్యాలీల పేరుతో ఇప్పటికే ఎన్డీయే ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు ర్యాలీల్లో ప్రధాని పాల్గొన్నారు. ఇవాళ భాగల్పూర్ లో జరుగనున్న ర్యాలీ కోసం సభా స్థలి వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగల్పూర్ మొత్తం కాషాయమయమైంది.