ఎన్కౌంటర్లో మావోయిస్టుల మృతి
మహారాష్ట్ర, జనంసాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా సిందేనూర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సిందేనూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు సహా ఒక సీఆర్పీఫ్ జవాను మృతి చెందారు.