ఎపికి రూ.1600 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం!

న్యూఢిల్లీ,నవంబర్‌30(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ సవిూకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు రూ.1600 కోట్ల రుణం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముందస్తు మదింపు కోసం ప్రపంచబ్యాంకు బృందం వచ్చేనెల 13వ తేదీన విజయవాడ రానున్నట్లు సమాచారం. మొత్తం రూ.1,600 కోట్ల రుణంలో రాష్ట్ర ప్రభుత్వం 30? సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిధులతో చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యరంగాల అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ రుణ ఒప్పందం ఖరారవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.