ఎపి ప్రభుత్వ కమ్యునికేషన్‌ సలహాదరుగా జివిడి

అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): జీవీడీ కృష్ణమోహన్‌ను  సలహాదారు(కమ్యునికేషన్స్‌)గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీడి గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ వాణి వినిపించడంలో ముందున్నారు. ఈనాడులో  జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించి ఎడిటోరియల్‌ కాలమ్స్‌ రాస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు. తర్వాత సాక్షి దిన పత్రిక ఆవిర్భావ సమయంలో ఆ పత్రికలో చేరారు. 2011 మార్చి 12న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే వైఎస్సార్‌ కుటుంబంలో ఒకరిగా జీవీడి మమేకమై..
పార్టీకి గొంతుకగా పార్టీని నడిపించారు. విూడియాలో పార్టీ వాణిని సూటిగా, ధైర్యంగా, నిక్కచ్చిగా వినిపించే వారు.