ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన దసరా ఉత్సవ కమిటీ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 07 (జనం సాక్షి)

వవరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను శనివారం కరీమాబాద్ ఉరుసు దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపుర సంజయ్ బాబు ఆధ్వర్యంలో కలిశారు. రాబోయే సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను గతంలో లాగా విజయవంతం చేసినట్టు ఈసారి కూడా ఎమ్మెల్యే నరేందర్ మరింత గొప్పగా నిర్వహించేలా తోడ్పడాలని కమిటీ కోరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రాజకీయ అధికార ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను మరింత విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు మేడిది మధుసూదన్, మండ వెంకన్న, వడ్నాల నరేందర్, వంగరి కోటేశ్వర్, గోనె రాంప్రసాద్, వెలిదే శివమూర్తి, సందీప్, సంజీవ్, వెంకటేశ్వర్లు, సంతోష్ గోవర్ధన్, చిరంజీవి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.