ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరికలు

శ్రీకాకుళం,మార్చి19(జ‌నంసాక్షి): టిడిపికి మరోమారు అధికారం కట్టబెట్టాలని, అప్పుడే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయని ఎంఎల్‌ఎ గుండ లక్ష్మీదేవి అన్నారు. చంద్రబాబు మాత్రమే ఎపిని అభివృద్ది చేయగలరని అన్నారు. కలింగ కోమట్లు కోరాడ హరిగోపాల, వైశ్య రాజు వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ స్వగృహంలో సుమారు 33 కుటుంబాలు మంగళవారం టిడిపిలో చేరాయి. ఎంఎల్‌ఎ గుండ లక్ష్మీదేవి వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గుండ లక్ష్మీ దేవి మాట్లాడుతూ.. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి డి లో చేర్చిన ఏకైక పార్టీ టిడిపి అని అన్నారు. మళ్ళీ టిడిపి ఎంఎల్‌ఎను గెలిపించాలంటూ.. ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.