ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యను కలిసిన దసరా ఉత్సవ కమిటీ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 10 (జనం సాక్షి)

వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ మంగళవారం ఎమ్మెల్సీ బసవరాజు కలిశారు. ఈ సందర్భంగా రంగలీల మైదానంలో ప్రతి ఏటా గొప్పగా నిర్వహించే సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను ఈసారి కూడా మరింత విజయవంతం అయ్యేలా సహకరించాలని ఎమ్మెల్సీ సారయ్యను కోరారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ ఉత్సవాలు మరింత గొప్పగా బ్రహ్మాండంగా జరిగేందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపూరి సంజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి మేడి మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, కన్వీనర్ వద్నాల నరేందర్, వంగరి కోటేశ్వర్, గోనె రాంప్రసాద్, శివ మూర్తి, సందీప్, సంతోష్, గోవర్ధన్, వెంకటేశ్వర్లు మొదలైన ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.