ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పంట పొలంలో డ్రోన్ తో స్ప్రే

జనంసాక్షి/ మెదక్ బ్యూరో ఆగస్టు 23 హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్సీ, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తన పంట పొలంలో డ్రోన్ తో నానో యూరియా పిచికారి చేయించారు. ఆ సమయంలో, తక్కువ మంది తో ఎక్కువ పంట పొలానికి డ్రోన్ పిచికారీ ద్వారా లబ్ధి చేకూరుతుందని సుభాష్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమయానుకూలంగా పంటలు పండిస్తే రైతుకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని సుభాష్ రెడ్డి అన్నారు . ప్రభుత్వంలో కెసిఆర్ నాయకత్వంలో సాగునీటి వనరుల లభ్యత పెరిగి లక్షల ఎకరాలు సాగు లోకి రావడం, దానికి తగ్గట్టుగా సాంకేతికత రైతులకు అందుబాటులోకి తెచ్చింది అన్నారు. పంట పొలాల కావలసిన పోషకాలతో పాటు, పురుగుమందులు కూడా డోన్ ద్వారా పిచికారి చేసుకోవచ్చని సుభాష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి విజయ నిర్మల, ఏఈఓ విజృంభణ,మండలంలోని పలు గ్రామాల సర్పంచులు నోముల శ్రీకాంత్, శ్రీహరి, మహిపాల్ రెడ్డి, రైతులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిద్దయ్య సిహెచ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.