ఎయిమ్స్లో కేంద్రమంత్రి శ్రమదానం
ప్రభుత్వాసుత్రుల్లో సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కాయకల్ప’ కార్యక్రమం కింద ఇటీవల కేంద్రమంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్లో పచ్చదనం- పరిశుభ్రత డ్రైవ్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా నేడు ఎయిమ్స్ను తనిఖీ చేసిన ఆయన.. క్లీన్ అండ్ గ్రీన్ డ్రైవ్లో పాల్గొన్నారు. స్వయంగా ఆసుపత్రి వార్డులను శుభ్రం చేశారు.
అనంతరం ఎయిమ్స్ సిబ్బందితో సదుపాయాలపై చర్చించారు. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని నడ్డా స్పష్టం చేశారు.