ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఏలూరు,జూలై23(జ‌నంసాక్షి): టి.నర్సాపురం మండలంలోని మధ్యాహ్నపువారి గూడెంలో అక్రమంగా నిల్వచేసిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..  గ్రామానికి చెందిన రైతు రాజనాల నాగేశ్వరరావు తన పొలంలో ఎర్రచందనం చెట్లు నరికి వేరేవారికి విక్రయించాడు. సుమారు 38 ఎర్రచందనం దుంగలను ఒకచోట భద్రపరిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సోమవారం రాత్రి గ్రామంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో 38 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ ఇంకా నిర్ధారించాల్సి ఉంది.