ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్

ఏర్గట్ల అక్టోబర్ 12(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్ గురువారం రోజున మండల కేంద్రములో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలుచేసి,మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం మొదటిగా ఎన్నికల ప్రచారాన్ని ఏరుగట్ల నుండి ప్రారంభిస్తున్నని కావున ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుతూ గడిచిన పదేళ్ల అవినీతి పాలనపై ప్రజలకు తెలియజేశారు. తాను చేసిన అవినీతి పాలనకు ఏర్గట్ల నుండే అంతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ పదేళ్ల బీఅర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి విపరీతమైన దోపిడి చేశాడని ఈ దోపిడీ పాలనకు తెరదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని కోరారు.బీఅర్ఎస్ ప్రభుత్వంలో రాచరికం తాండవిస్తుందనీ ప్రజలను భానిసలుగా చూస్తున్నారనీ,వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి ఓటమితో ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుందనీ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు ఏకకాలంలో 2లక్షల ఋణమాఫీ చేస్తామని, రైతులకు పెట్టుబడి సాయం15000/- అందిస్తామని తెలిపారు