ఎసిబి డిజిగా వెంకటేశ్వర రావు

ఉత్తర్వులు ఇచ్చిన సిఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం
అమరావతి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఎపి  అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఇంతకముందు ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావును ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఆయనను సోమవారం ఏసీబీ డీజీగా నియమిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూరే ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.