ఎసిబి వలలో విఆర్‌వో

వికారాబాద్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : జిల్లాలోని నవాబుపేట తహసీల్దర్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వీఆర్‌వో రాములు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే భూమికి సంబంధించిన పహాని కోసం డిజిటల్‌ లాక్‌ తెరవడానికి రైతు నుంచి వీఆర్‌వో లంచం డిమాండ్‌ చేశాడు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు ఈ రోజు తహసీల్దార్‌ కార్యాలయంలో మాటు వేసిన అధికారులు లంచం తీసుకుంటుండగా రాములును పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.