ఎస్ఐ లోకేష్ ను సన్మానించిన మునగాల మండల్ ప్రెస్ క్లబ్

సూర్యాపేట జిల్లా మునగాల మండల్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ జి ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రింట్ మీడియా సంబంధించిన జర్నలిస్టులు మంగళవారం మునగాల పోలీస్ స్టేషన్ లో నూతన
ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన పి.లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్ఐ పి. లోకేష్ మాట్లాడుతూ, ప్రజా రక్షణతో పాటు వారి సమస్యలు పరిష్కరిస్తూ శాంతిభద్రతలు పరిరక్షించడం పోలీసుల ప్రధమ కర్తవ్యమని, అదేవిధంగా పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులకు జరిగే న్యాయం ద్వారానే పోలీసులకు గుర్తింపు ఉంటుందని అన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు జి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బాధితులకు నిష్పక్షపాతంగా న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించినారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బెజవాడ గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి జె సామ్యూల్, జర్నలిస్టులు దస్తగిరి, తుమ్మల వెంకటేశ్వర్లు, సోమపొంగు గోపి తదితరులు పాల్గొన్నారు.