ఎస్సీ, ఎస్టీలకు బడ్టెట్లో రూ.పదివేలకోట్లు
సబ్ప్లాన్ నిధులకు మానిటరింగ్ కమిటీ
ముఖ్యమంత్రి కిరణ్
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) :
ఎస్సీ, ఎస్టీలకు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రూ. 10 వేల కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కౌన్సిల్, నోడల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ
జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయిస్తామన్నారు. సబ్ ప్లాన్ నిధుల ఖర్చు పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సమావేశంలో జరిగిన వివరాలను మంత్రి బాలరాజు మీడియాకు వివరించారు.