ఎస్సైని కాల్చి చంపిన వేటగాళ్లు

nv4tjapyజంతువుల వేటను అడ్డుకునేందుకు వెళ్లిన ఒక ఇన్‌స్పెక్టర్ ను వేటగాళ్లు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనలో మనోజ్ కుమార్ అనే ఎస్సై మరణించాడు. గత రాత్రి ఫరిదాబాద్ అడవుల్లో కొందరు దుండగులు జంతువులను వేటాడేందుకు వచ్చారని సమాచారం అందుకున్న మనోజ్ కుమార్..తన బృందంతో అక్కడికి వెళ్లాడు. పోలీసుల రాకను గమనించిన వేటగాళ్లు కాల్పులు జరపడంతో మనోజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతన్ని ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మరణించాడు. కాల్పులు జరిపిన నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.