ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్కు మొబైల్ నమోదు తప్పనిసరి
ప్రకటన విడుదల చేసిన ఎస్బిఐ
న్యూఢిల్లీ,అక్టోబర్13(జనంసాక్షి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నెట్ బ్యాంకింగ్కు మొబైల్ నెంబరు రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని బ్యాంక్ సూచించింది. లేనట్లయితే.. డిసెంబరు 1వ తేదీ తర్వాత నెట్ బ్యాంకింగ్ బ్లాక్ కానుందని ఎస్బిఐ తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎస్బీఐ వినియోగదారుల కోసం తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ‘ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు.. వెంటనే విూ మొబైల్ నెంబరును రిజిస్టర్ చేయించుకోండి. లేదంటే డిసెంబరు 1నుంచి విూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడును’ అని ఎస్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఇచ్చిన గడువు లోపు మొబైల్ నెంబరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఖాతాదారుల బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, ఈ మెయిల్ అలర్ట్ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జులై 6, 2017లో అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్బీఐ నెట్బ్యాంకింగ్కు మొబైల్ నెంబరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది.