ఎస్‌బీహెచ్‌ విలీనాన్ని ఒప్పుకోం: సురవరం

హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఎస్‌బీహెచ్‌ను విలీనానికి తాము వ్యతిరేకమని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా జులై 28, 29న ఎస్‌బీహెచ్‌ ఉద్యోగులు సమ్మె చేయనున్నట్లు తెలిపారు. ఎస్‌బీహెచ్‌ విలీనం రద్దు కోరుతూ సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. విలీనం రద్దుపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.