ఎస్ ఎఫ్ ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షులు దడిగ సందీప్ కుమార్
బచ్చన్నపేట నవంబర్ 1 (జనం సాక్షి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షులు దడిగ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు మహాసభల వాల్ పోస్టర్లను స్థానిక మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం విద్యారంగ సమస్యల పైన అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు డిసెంబర్ 13 నుంచి 16వ తారీకు వరకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని ఆ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రాతినిధులు హాజరవుతున్నారని ఈ మూడు రోజులపాటు జరిగే మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను బేశరధిగా తిప్పి కొట్టడం కోసం ఒక బలమైన తీర్మానాలు చేయబోతున్నామన్నారు అనంతరం భవిష్యత్తు కర్తవ్యాలతో దేశంలో ఒక బలమైన కార్యాచరణను రూపొందించి ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు కాబట్టి ఎస్ఎఫ్ఐ నిర్వహించే పోరాటాలకు మహాసభల విజయవంతానికి విద్యార్థులు మేధావులు వివిధ వర్గాల ప్రజలందరూ ఆర్థిక సహాయ సహకారాలు అందించి మహాసభల విజయవంతానికి కృషి చేయాలని కోరారు ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీలలో మతపరమైన ఘర్షణలు తీసుకొచ్చి విద్యార్థులకు మధ్య కలహాలు పెడుతుందన్నారు అలాంటి పరిస్థితులలో విద్యార్థులు అందరూ ఐక్యమై సమస్యలను ఎదుర్కోవాలని అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు లవ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు కందుకూరి వంశీ నాయకులు కడారి అజిత్ గణేష్ ఉదయ్ మహేష్ భరత్ తదితరులు పాల్గొన్నారు

ఇట్లు,
ఎస్ఎఫ్ఐ బచ్చన్నపేట మండల కమిటీ
సెల్:8639134754