ఏఐఎసెస్డీ జిల్లా మహాసభను విజయవంతం చేయండి – సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగ్ రాజ్

హత్నూర (జనం సాక్షి)
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని గుండ్లమాచునూర్ గ్రామంలో గల అంబేద్కర్ భవనంలో ఈ నెల 16న నిర్వహించే ఏఐఎసెస్డీ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగ్ రాజ్ అన్నారు.మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో మంగళవారం జిల్లా మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల,మృతి,వర్గాలకు అతీతంగా యువతలో సామాజిక పరివర్తనను పెంపొందిస్తూ దేశ సమగ్రతను పటిష్టపరచాలనే ధృడ సంకల్పంతో డా.బిఆర్ అంబేద్కర్ ఏఐఎసెస్డీ సంఘాన్ని స్థాపించారని వారు గుర్తు చేశారు.కొన్ని మతోన్మాద శక్తులు రాజకీయం ముసుగులో అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని వారన్నారు.ప్రజలు,మేధావులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై మహాసభను జయప్రదం చేయాలని వారు కోరారు.కార్యక్రమంలో కృష్ణ,సత్యనారాయణ,నవీన్ కుమార్,భాను చందర్, నర్సింలు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.