ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది – ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి

ఆగస్టు 5 : ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి చెప్పారు. కాని కొన్ని పార్టీలు ఉద్ధేశపూర్వకంగానే బీజేపీని విమర్శిస్తున్నాయన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్య ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ యువమోర్చా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రప్రభుత్వ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకువెళతామని, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన చెప్పారు