ఏపీలో ఎస్సై ఫలితాలు విడుదల
– విడుదల చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి
అమరావతి, జులై22(జనంసాక్షి) : ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్సై పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం ఆసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ¬ంశాఖ మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సై సివిల్, డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు 15,409 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆర్ఎస్ఐ, ఏపీఎస్పీ పోస్టులకు 12,934 మంది, స్టేషన్ ్గ/ర్ ఆఫీసర్లకు 14,823 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. త్వరలోనే ధ్రువపత్రాలను తనిఖీ చేస్తామని ¬మంత్రి సుచరిత వెల్లడించారు. 333 ఎస్సై స్థాయి ఉద్యోగాలకు 1,35,414 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ ఫలితాలను కూడా వారం రోజుల్లోగా విడుదల చేయాలని సుచరిత అధికారులనుఆదేశించారు.