ఒంటి కాళ్లతో నిరసన చేసిన విఆర్ఏలు

మల్దకల్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ఒంటికాలతో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ తమ డిమాండ్ లను అమలు చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామనిఆయన అన్నారు,అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి,వి ఆర్ ఏ లకు వెంటనే పే స్కేలు ఇవ్వాలి, ఉపాధ్యక్షుడు నరింహులు,కార్యదర్శి వెంకటేష్,కమిటీ సభ్యులు తిరుమల్ గౌడ్ ,రామకృష్ణ, ఈదన్న ,భీముడు, కిష్టన్న, ఎల్లప్ప,శంకర,భీముడు,మునెమ్మ, తిమ్మమ్మ ,నామాల వినోద్,ఆయా గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.